
మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి
పయనించే సూర్యుడు జూన్ 2 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లె : మండల వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి జూన్ 4వ తేదీ బుధవారం రాజంపేటలో జరగబోయే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు మిథున్ రెడ్డి, రఘునాథరెడ్డి మరియు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బస్టాండ్ ఆవరణలోని వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అబద్దాలతో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం కొత్త ఏమీ కాదని, నాడు ఎన్టీఆర్ కు నేడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలందరినీ మోసగించారని , ప్రజలకు అండగా జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవంలో వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన పోరాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆరం రెడ్డి, వైఎస్ఆర్సిపి బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెహమాన్ ఖాన్ , జడ్పిటిసి ఇస్మాయిల్, జిల్లా గిరిజన విభాగం అధ్యక్షుడు చంద్ర నాయక్, సర్పంచ్ రామా జయచంద్ర, ఎంపీటీసీలు నసీమా భాను, ఆదం ఖాన్, బెల్లం సంజీవరెడ్డి లతో పాటు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.