
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత
పయనించే సూర్యుడు బాపట్ల జూన్ :-14 రిపోర్టర్ (కే శివకృష్ణ)
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్ కు సవాల్ విసిరారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ…వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా? అని జగన్ కు సవాల్ విసురుతూ…విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. 67లక్షల 27వేల 164 మందికి తల్లికి వందనం అందజేశాం. దాదాపు 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయి. తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాబు ల కృషి ఎనలేనిది. తల్లికి వందనం పథకానికి 10వేల 091 కోట్లు వ్యయం చేయనున్నాం. పాఠశాలల అభివృద్ధి కోసం 13వేల 046 కోట్లు వెచ్చించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నాం. ఒక్కరుంటే 13వేలు, ఇద్దరుంటే 26వేలు, ముగ్గురుంటే 36వేలు, నలుగురుంటే 52వేలు, ఐదుగురుంటే 65వేలు అందజేశాం. ఒక కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలున్నారు, వారికి తల్లికి వందనం అందడంతో పత్రికా ముఖంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 5మంది కి 65వేలు తల్లికి వందనం అందడంతో వారు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లకు ఫోన్లు చేసి మా బిడ్డలకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో జగన్ ‘‘నాచెల్లెమ్మలు, నా ఆడపడుచులు, వారి బిడ్డలకు నేను మేనమామ’’అని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక కంసమామగా మారారు. ఎన్నికలకు ముందు జగన్ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారు. ఒకరికే ఇచ్చి పరిమితులు పెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం పరిమితులు పెట్టలేదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి అందజేసింది. 2022-23లో జగన్ రూ.42లక్షల 61వేల మందికే అమ్మఒడి ఇచ్చారు. మొత్తం రూ.5వేల 500 కోట్లే ఇచ్చారు. వారు 42లక్షల 61 వేల మందికి మాత్రమే ఇచ్చారు. మేం 67లక్షల 27 వేల మందికి ఇచ్చాం. అదనంగా దాదాపు 25 లక్షల మందికి అదనంగా తల్లికి వందనం అందజేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున విద్యార్థులకు కిట్లు కూడా అందజేశాం.ఆ కిట్లల్లో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు, టై, డిక్షనరీ అన్నీ కలిపి 2,220 రూపాయలు విలువ చేసే కిట్ అందజేశాం. విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న యువగళం నాయకుడు నారా లోకేష్. మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్ లలో మౌలిక సదుపాయాలు కల్పించాం. అన్ని సంక్షేమ హాస్టల్స్ లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. 2014-2019లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేవారం 2019-24లో అధికారం వెలగబెట్టిన రంగుల రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేశారు. డొక్కా సీతమ్మ పేరున మళ్లీ మధ్యాహ్న భోనం అందజేస్తున్నాం. మెగా డిఎస్సీపై తొలి సంతకం అన్నాం చేసి చూపించాం. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఇది గిట్టని వైసీపీ నాయకులు 24 కేసులు పెట్టించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లగా సుప్రీం కోర్టు కూడా వైసీపీకి మొట్టికాయలు వేసింది. ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. వైసీపీ పాలనలో అనేకమంది సలహాదారులు ఉన్నప్పటికి రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదు. జగన్ శవ రాజకీయాలు చేస్తూ శవాలవద్దకూడా నవ్వే శాడిస్టు జగన్. శవ రాజకీయాలు చేయడం, మహిళలను అవమానించడం జగన్ పేటెంట్. తల్లి, చెల్లిని రోడ్డుపాలు చేశారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. మళ్లీ బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే తల్లికి వందనం రూ.15 వేలల్లో పాఠశాల అభివృద్ధికి 2 వేలు, విద్యార్థుల తల్లలు ఖాతాల్లో 13 వేలు వేయడం జరిగింది. లోకేష్ జేబుల్లోకి తల్లికి వందనం డబ్బులు 2వేలు వెళ్లాయని చెబుతున్నారు. 2 వేలు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసురుతున్నా. నిరూపించలేకపోతే జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా? ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలే మిమ్మల్ని డైవర్ట్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడ ఇవ్వలేదంటే ప్రజలకు జగన్ పై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమౌతోంది. అందరికి ఇబ్బంది పెట్టారు. అనవసరం గా నిందలు వేస్తే సహించేది లేదు. ముక్కు నేలకేసి క్షమాపణ కోరాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానాలి. ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదు. చెప్పిన విధంగా మాట నిలబెట్టుకున్నాం. కష్టకాలంలోనూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం భావితరాల విద్యార్థుల మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుందని మంత్రి సవితమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.