
బంధువులకు ఇవ్వకుండా కాల్చి దహనం చేయడం హేయమైన చర్య.
పయనించే సూర్యుడు మే 27 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా లో
వి. ప్రభాకర్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి
మృత దేహాలను చూసి బయపడిన మోడీ, అమిద్ షా, బిజెపి ప్రభుత్వం కనీసం శవాలను బంధువులు అడిగిన ఇవ్వకుండ కాల్చి వేయడం అప్రజాస్వామిక హేయమైన చర్యకు పాల్పడాడ్డారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నిజామాబాదు రూరల్ -కామారెడ్డి జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ దుయ్యాబట్టారు. 27-05-25మంగళవారం నాడు అర్ముర్ లో మాస్ లైన్ పార్టీ కార్యలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. .. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్ కౌంటర్ మృతి చెంది ఆరు రోజులైనా బంధువులకు వారి మృత దేహాలను అప్పగించక పోవడం కేంద్ర, రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని, బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడి శవాల కూడ బయ పడ్డాయని అన్నారు. అంత్యక్రియలు గౌరవప్రదంగా జరుపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వక పోవడం చూసి సమాజం బిజెపి ప్రభుత్వనికి రాజ్యాంగం పట్ల ప్రజా స్వామ్యం పట్ల ఎంత చిత్త శుద్ధి ఉన్నదో మరోసారి తేట తెల్లం అయ్యిందని ఏద్దేవా చేశారు. బందు మిత్రులను నిర్బంధం, బెదిరింపులు పాల్పడుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రలకు చెందిన వారి మృత దేహాలను అప్పగించడానికి ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర చేసారని ఆరోపించారు. ప్రభుత్వాల, పోలిసుల ఈ దుర్మార్గ వైఖరి చూస్తే పట్టుకువచ్చి కాల్చి చంపినట్లు వచ్చే వార్తలను విశ్వాసించేలా ఉందని ఆరోపించారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్నారని, సరిహద్దులలో చేసే యుద్ధం దందకారణ్యంలో చేస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యము ఫాసిస్టు విధానంలో భాగంగానే ఇది జరుగుతున్నదని అన్నారు. అక్కడ దొరికే 29 రకాల విలువైన ఖనిజాలా కోసం కార్పొరేట్ కంపెనీల లాభాల దాహం కోసం ఈ నరమేధం చేస్తూ, రక్త పీపాసులుగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా నరమేధం ఆపి, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, నరమేధం ఆపాలని, ఎన్కౌంటర్పై, ఆదివాసుల మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవరం,జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, s సురేష్, కె రాజేశ్వర్, జి కిషన్, సత్తెక్క, బి కిషన్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏ ఐ పి.కె.ఎం.ఎస్ జిల్లా ఉపాధ్యక్షలు బి కిషోర్, నాయకులు అరవింద్, నిఖిల్, కట్ట రాములు, పాల్గొన్నారు
