
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విరాళం ఇవ్వడం పట్ల శ్రీనివాసులగూడ గ్రామస్తుల హర్షం
నందిగామ మండలం శ్రీనివాసులగూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ రూ. 50 వేల విరాళాన్ని అందజేశారు. అడిగిన వెంటనే విరాళం ఇవ్వడం పట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, మల్లేష్, రవీందర్ రెడ్డి, కృష్ణయ్య, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, సతీష్ లు అంజయ్య యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సనాతన ధర్మాలను పాటిస్తూ, దేవాలయాల నిర్మాణాల కోసం దాతలు సైతం ముందుకు రావాలని, గ్రామాలలో నూతన దేవాలయాలను నిర్మించడం సంతోషకరమని ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణానికి రూ. 50వేల నగదును అందజేయడం పట్ల శ్రీనివాసులగూడ గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కారె శేఖర్, మొయినోద్దీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.