
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు పులి గోళ్ళ శ్రీనివాస్ యాదవ్, ఏడుకొండలు, శ్రీనివాస్,ప్రకాష్, ముకుంద రామారావు ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, డివిజన్ అధ్యక్షులు మోయునుద్దిన్, నరసింహ యాదవ్, మస్తాన్ రెడ్డి ,కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి, రవి ముదిరాజ్ ,సతీష్ రెడ్డి, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
