
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా 29 తేదీ మార్చ్ వడ్ల శ్రీనివాస్
నారాయణ పేట జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి స్కూల్ లో తెలుగు సంవత్సరాది ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త మట్టి కుండలో షడ్రుచుల పచ్చడి చేసి వితరణ చేశారు.పాఠశాల కరస్పాండెంట్ సాయిలీల మాట్లాడుతూ పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో కష్టసుఖాలు సమానం అనే సందేశం ఇస్తుందని తెలిపారు.విద్యార్థులు , ఉపాధ్యాయులు మన సంస్కృతులు,సంప్రదాయాలను పాటిస్తూ రాబోయే తరానికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలప్ప,అమీనా,హెచ్.నర్సింహా,సురేందర్ గౌడ్,హరీష్, లక్ష్మిప్రియ,ఉమ,లక్ష్మీదేవి,శ్రావణి,సురేష్,ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
