Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చెయ్యాలని ఆదివాసీ జేఏసీ చేస్తున్న రిలే నిరాహారదీక్షలు దీక్షలకు...

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చెయ్యాలని ఆదివాసీ జేఏసీ చేస్తున్న రిలే నిరాహారదీక్షలు దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ ఎంపిటిసి కారం బాపన్న దొర,

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 26.

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు 12వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి రిలే నిరాహార దీక్షలకు హాజరైన వారికి పూలమాలవేసి స్వాగత ఉపాన్యాసంతో ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి బంద పల్లి,తాటి వాడ మాజీ ఎంపిటిసి కారం బాపన్న దొర మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి,తక్షణమే 100% స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి సభ్యులుతో కమిటీతో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు బంద పల్లి,తాటి వాడ గ్రామ పంచాయితీల ఉద్యోగులు,నిద్యోగులు,మాజీ సర్పంచ్,మరియు గ్రామస్తులు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.అలాగే మాజీ సర్పంచ్ కారం సింహాచలం దొర మాట్లాడుతూ…ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదవ,ఆరవ షెడ్యూల్డ్ లోని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టి.ఎ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రుల భవిష్యత్తును కాపాడాలని టి.ఏ.సి కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులకు మరియు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో చోడి వెంకటేశ్వర్లు దొర,కారం వెంకటేశ్వర్లు దొర,కారం అబ్బాయి దొర,అన్నిక ఎర్రచిన్ని,కారం చిన్న వెంకటేశ్వర్లు దొర,కారం చిన్నఅబ్బాయి దొర,కంగాల రాము,చవలం కొమ్మన్న దొర,తుర్రం శ్రీనివాసు దొర,కారం చిన్న రామన్న దొర,పండా పవన్ కుమార్ దొర,మడకం వీర వెంకట వరప్రసాద్ దొర,చవలం శుభకృష్ణ దొర,ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,కారం రామన్న దొర,పొడియం శ్రీను వాసు దొర,పొడియం పండు దొర,ఈక రాజన్న దొర మరియు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments