Thursday, June 12, 2025
HomeUncategorizedషెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకాల చట్టం ప్రకటించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్,టిఎసి కమిటీ సభ్యులు సోళ్ల...

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకాల చట్టం ప్రకటించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్,టిఎసి కమిటీ సభ్యులు సోళ్ల బోజ్జి రెడ్డికి ఆదివాసీ జేఏసీ వినతి

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 10.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం లో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం తక్షణమే టీఏసీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రకటించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు టిఏసీ కమిటీ సభ్యులు సోళ్ల బోజ్జి రెడ్డికి వినతి పత్రంతో పాటు మరికొన్ని సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి,దేవీపట్నం బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…2025 జనరల్ డిఎస్సి నుండి ఏజెన్సీ పోస్ట్లు మినహాయించి ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అన్ని ఐటిడీఏల ద్వారా ట్రైకార్ రుణాలు ఆదివాసి యువతకు మంజూరు చేయాలని,ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలని,రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన దొర పేరుతో ఆదివాసి ప్రత్యేక జిల్లా ప్రకటించాలని,దేవారం,శరభవరం గ్రామపంచాయతీల రైతులకు ముసిరిమల్లి ప్రాజెక్టు కాలువకు పూడిక తీసి కెనాల్ ద్వారా సాగునీరు అందించాలని,రంపచోడవరం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని,దేవారం గ్రామపంచాయతీ,ఇందుకూరు గ్రామపంచాయతీలలో ఉన్న చెరువులకు కొత్త తూములు కలింగులు ఏర్పాటు చేయాలని, గోకవరం డిపో నుండి దేవారం గ్రామానికి వచ్చే ఏపీఎస్ఆర్టీసీ బస్ టైమింగ్స్ ఉదయం 8 గంటలకు సాయంత్రం ఐదు గంటలకు వచ్చే విధంగా మార్పు చేయాలని,ప్రతి ఆశ్రమ పాఠశాలకు సోలార్ పెన్సింగ్ మంజూరు చేయాలని,చిన్నారి గండి ఆర్ అండ్ ఆర్ కాలనీ పెనికికలపాడు గ్రామానికి సురక్షిత మంచినీటి ఆరో ప్లాంట్ మంజూరు చేయాలని,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని,దేవారం,ఇందుకూరు, చొప్పకొండ,డిఎన్ పాలెం గ్రామపంచాయతీలలో శిథిల వ్యవస్థలో ఉన్న అంగన్ వాడి బిల్డింగ్లను తొలగించి కొత్త అంగన్వాడి బిల్డింగులు మంజూరు చేయాలని,ఏజెన్సీ అన్ని మండల కేంద్రాల్లో జీడిపిక్కల మినీ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని,ఏజెన్సీ మారుమూల గ్రామాలకు తారు రోడ్లు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయాలని,ఆదివాసీ రైతులకు వ్యవసాయ పనిముట్లు మంజూరు చేయాలని మొదలైన సమస్యలపై వినతి పత్రాలు అందజేశామన్నారు.పై సమస్యలపై ఎస్టీ కమిషన్ చైర్మన్,టిఎసి కమిటీ సభ్యులు చోళ్ల బొజ్జి రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వాలంటీర్ యలగాడ నాగేశ్వరరావు,బిజెపి జిల్లా కార్యదర్శి కుండ్ల కృష్ణారెడ్డి,సిహెచ్.తేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments