
( పయనించే సూర్యుడు మే 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
భారతదేశ మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు పట్టణంలోనీ ఫరూఖ్ నగర్ బాలికల పాఠశాల వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…దేశం లో సాంకేతిక విప్లవం రావాలని నూతన శకానికి శ్రీకారం చుట్టారన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడన్నారు.ఈ కార్యక్రమంలలో, మార్కేట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,, రఘు నాయక్, జృమద్ ఖాన్,అందే మోహన్,సాయి వంశీ, హరినాథ్ రెడ్డి, ఇబ్రహీం,మురళి మోహన్, కొప్పునూరి ప్రవీణ్,రాజేష్ గౌడ్,ఖదీర్, మాధువలు,అర్జున్, సీతారాం,నవీన్,ఖదీర్,మంగ అశోక్, నీరటి వాసు, మన్నే రవి, రాజు,గంగమోని సత్తయ్య, సాయి కుమార్ ,శేకారప్ప ,రవితేజ,ముబారక్ అలీ ఖాన్,బచ్చలి నరేష్, విగ్నేష్ రెడ్డి, శంకర్, మహమ్మద్,తదితరులు పాల్గొన్నారు.
