
మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్..
పయనించే సూర్యడు, జూలై 12, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి ) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగివుండాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సంఘ సభ్యులకు సూచించారు. శుక్రవారం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ అర్పిలు, సంఘ సభ్యులతో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నారు. టైర్ ల మధ్యలో, కొబ్బరి బొండాలలో, కూలర్ లలో నీరు నిల్వ ఉన్న చోట నీరును తొలగించి శుభ్ర పర్చాలని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెంది, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉందన్నారు. ఈ విషయంపై అర్పిలు విధిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిధిలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ మహేష్, సదానందం, సి.ఎల్.అర్పి మంజుల, శానిటరీ జవాన్లు, అర్పిలు, పలువురు పాల్గొన్నారు.