
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మున్సిపల్ పరిధిలోని భీంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం మజీద్ ఏరియాలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ పవర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని.. దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్ వద్ద గల పంచర్ దుకాణంలోని పాత టైర్లను అక్కడి నుండి తరలించి వాటిని దగ్ధం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అజయ్ పవర్ ఆరోగ్య, సూపర్వైజర్స్ ఏ ఎన్ ఎం ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
