Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిద్దాం

సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిద్దాం

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 18(పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లో మండల పంచాయతీ కార్యదర్శుల తో జరిగిన సమావేశంలో సులానగర్ ప్రభుత్వ వైద్యాధికారి కందుల దినేష్ పాల్గొని ఈ వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. పంచాయతీరాజ్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేసి వ్యాధులు ప్రబలకుండా ఈ సీజన్ ని ఆరోగ్యకరంగా ముగిద్దామని దీని కొరకు ప్రజలలో పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించే విధంగా ప్రజలలో విస్తృతంగా అవగాహన కలిగిద్దామని, ముఖ్యంగా దోమలు ఈగలు పెరగకుండా మంగళవారం మరియు శుక్రవారం విధిగా డ్రైడే కార్యక్రమాలు నిర్వహిద్దామని నిల్వ నీటి కుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం వంటి అంశాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ కలింగి శ్రీనివాస్ రావు, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్ నాగుబండి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments