Thursday, October 23, 2025
Homeఆంధ్రప్రదేశ్సూళ్లూరుపేట లోని గవర్నమెంట్ హాస్పటల్ లో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

సూళ్లూరుపేట లోని గవర్నమెంట్ హాస్పటల్ లో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ ని సూళ్లూరుపేట లోని ” గవర్నమెంట్ హాస్పిటల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె. బాలాజి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక‌్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ సి.హెచ్. రమేష్, ఇతర హాస్పిటల్ సిబ్బంది, ఓ.ఆర్.డబ్ల్యూలు, కె.మంజుల, టి. నందిని, ఎ.యన్.యమ్ జి. శ్రీ లత, పి.ఇ లు మరియు 70 మంది ప్రజలు పాల్గొనడం జరిగింది. తదుపరి హాస్పిటల్ సిబ్బంది తో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్గించడం జరిగింది. తదుపరి “పాండురంగ స్ట్రీట్” ఏరియాలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం కోసం జానపద కళాకారులు తో కలిసి ఆటలు, పాటలు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో 75 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీరిలో 12 మంది ప్రజలుకు నవజీవన్ సంస్థ ఎ.యన్.యమ్ ద్వారా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments