PS Telugu News
Epaper

ఐదవ షెడ్యూల్ భూభాగం లో (ఏజెన్సీ )1/59 ఎల్.టి.ఆర్ చట్టాలను పటిష్టంగా అమలు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30 అల్లూరి సీతారామరాజు జిల్లా

చింతూరు డివిజన్ చింతూరు మండలం ఎర్రంపేట గ్రామ వాస్తవ్యుడు మడివి. రాజు s/o తమ్మయ్య తనకు సంబంధించిన భూమిని పరిటాల సత్యనారాయణ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ( ఇంటి నిర్మాణము మరియు షాపులు)జరిగాయని చింతూరు డివిజన్లో ఉన్నటువంటి మండలంలో గ్రామాలన్నీ ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి చెందినవి ఈ ప్రాంతాలలో 1/59 ఎల్.టి.ఆర్ చట్టం మరియు 1/70 అమలు అవుతున్న గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు ఏ రకంగా అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారం చేస్తూ గిరిజన భూములు అన్యాక్రాంతానికి ఏ రకంగా గురి కాగలుగుతున్నాయి. ఈ విషయంపై ఐటీడీఏ లో ఏర్పాటు చేసిన ఎల్. టి.ఆర్ విభాగానికి తనకు న్యాయం చేయమని ఈ రోజున ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్ డివిజన్ ప్రచార కార్యదర్శి.సోడి.శ్రీను మండల జేఏసీ చైర్మన్ పి. రామకృష్ణ, మడివి.రాజు, రాఘవయ్య, సంజీవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top