
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 5వ
షెడ్యూల్ భూ భాగంలో,1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులు ప్రభుత్వం మరియు ఆదివాసుల భూములను కబ్జాలు చేసి మరియు డబ్బాషా చూపించి అమాయకులైన వారి దగ్గర నుండి భూములు తక్కువ ధరలు కొనుగోలు చేసి, విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కట్టి ఉంటే అధికారులకు అవి కనిపించడం లేదా? లేక చూసి చూడనట్లుగా నటిస్తున్నారా? లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అనే సందేహాలు వస్తున్నాయని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా అధికారులను ప్రశ్నించారు. ఎన్నాళ్లకు కలెక్టర్ మరియు ప్రభుత్వం సొరవతో ఏజెన్సీ ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో రోడ్డును సైతం కబ్జా చేసిన గిరిజనేతరుల ఇల్లు మరియు షాపులను కూల్చివేయడం పట్ల హర్షంగా ఉందని,1/70 చట్టమున్న మా 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు లేకపోయినా అమాయక మా ఆదివాసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని దోచుకుంటున్న మీకు మా ప్రాంతంలో బ్రతికె అర్హత లేదని ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా హెచ్చరించారు.అధికారులు రోడ్ల కోసమే కాకుండా మా ప్రాంతంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారికి భూములు ఇచ్చి బినాములుగా వ్యవహరిస్తున్న మా ఆదివాసుల పైన కూడా చర్యలు తీసుకోవాలని, పోలవరం ముంపులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు ప్యాకేజీ నిలుపుదల చేయాలని అనిల్ డిమాండ్ చేశారు. గతంలో చింతూరు మండలం లో అనేక ఎల్ టి ఆర్ కేసులు పెట్టిన అధికారులు నోటీసుల ఇచ్చి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని ఆదివాసీ జేఏసీ గా డిమాండ్ చేస్తున్నాము.