PS Telugu News
Epaper

యాగంటి క్షేత్రంలో 5న పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనలు “

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజీవి కళాక్షేత్రం కర్నూలు, అరుణ భారతి సాహితి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నాటక ప్రదర్శనలు నాటక ప్రదర్శనల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన బిసి రాజారెడ్డి ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి నందు నవంబర్ 5వ తేదీ నిర్వహించనున్న పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనలకు సంబంధించిన వాల్ పోస్టర్లను బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజీవి కళాక్షేత్రం కర్నూలు, బనగానపల్లె అరుణ భారతి సాహితి సంస్థ ఆధ్వర్యంలో యాగంటి క్షేత్రం నందు పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనల కార్యక్రమం ఏర్పాటు చేశారు. 5వ తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుండి నాటక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులచే పడక సీను, శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం యుద్ధ సీను, భవాని సీను, సత్య హరిచంద్ర నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటికి సంబంధించిన వాల్ పోస్టర్లను బిసి రాజారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, భూషన్న, శంకేశ్వర్ రెడ్డి , నారాయణరెడ్డి , రామ శేఖర్, భరతుడు, శివుడు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top