Friday, March 14, 2025
Homeఆంధ్రప్రదేశ్రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలంటూ కేఓసీ లారీల అడ్డగించిన గ్రామస్తులు

రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలంటూ కేఓసీ లారీల అడ్డగించిన గ్రామస్తులు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 13 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల ద్వారా వస్తున్న దుమ్ము దూళితో ఇబ్బంది పడుతున్న‌ట్లు పేర్కొంటూ సింగరేణి అధికారులను, వారి వాహనాలను రేగులతండా గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల ద్వారా వస్తున్న దుమ్ము దూళితో ఇబ్బంది పడుతున్న‌ట్లు పేర్కొంటూ సింగరేణి అధికారులను, వారి వాహనాలను రేగులతండా గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం మండల కేంద్రం దాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో రేగులతండా నుండి దాస్ తండా వరకు రోడ్డు విస్తీర్ణంలో భాగంగా పనులు మొదలుపెట్టిన గుత్తేదారు పనులు మధ్యలో ఒదిలిపెట్టాడు. దాంతో రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న రేగులతండా, దాస్ తండా గ్రామస్తులు దుమ్ము దూళితో తీవ్ర‌ ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అనేకసార్లు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజ్ఞాప‌న‌లు, నిరసనలు చేశారు. సింగరేణి అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు అంద‌జేశారు. అయినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో గురువారం రేగుల తండాలో ఇస్లావత్ నామానాయక్ ఆధ్వర్యంలో సింగరేణి అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ విషయమై సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం ఈసం కృష్ణయ్య, స్థానిక సీఐ తాటిపాముల సురేశ్‌తో ఫోన్ ద్వారా వారితో మాట్లాడి.ఈ నెలాఖ‌రు నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిర‌స‌న‌ను విర‌మించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments