Sunday, March 16, 2025
Homeఆంధ్రప్రదేశ్హుజురాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ లా దిష్టిబొమ్మ దహనం

హుజురాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ లా దిష్టిబొమ్మ దహనం

Listen to this article

పయనించే సూర్యడు // మార్చ్ // 16 // హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..

హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి,,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశం లో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారని, ఇలా అనేక రకాలుగా దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన, టిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను,, పిసిసి ఆదేశాలతో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరియు జగదీశ్వర రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది అని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోల్లు బాబు, సందమల్ల బాబు, ఆలేటి సుశీల, ఏర్ర రమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బండారి సదానందం, దుబాసి బాబు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు జుపాక సంపత్, గడ్డం రాఘవేంద్ర, గంటా కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల రాజు, కుమార్,సందీప్,తాళ్ళపెళ్లి రమేష్,తిరుపతి, యండి రియాజ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments