Thursday, March 20, 2025
Homeఆంధ్రప్రదేశ్విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి త్రివ అన్యాయం.

విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి త్రివ అన్యాయం.

Listen to this article

విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి .

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్

( పయనించే సూర్యుడు మార్చి 20 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ )

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 – 2026 సంవత్సర మొత్తం బడ్జెట్. 3,04,965 కోట్లు. విద్య రంగానికి కేవలం 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి త్రివ అన్యాయం చేస్తుంది అని అన్నారు. ప్రజా ప్రభుత్వం లో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి నోచుకోదా.? ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం అన్న మాట ప్రభుత్వం మర్చిపోయిందా. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి నికి 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన ఇప్పటికీ విద్యారంగా సమస్యలు పరిష్కారం కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు కానున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా విచారకరం. ఇది విద్యా రంగంలో పాలనాపరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. మంత్రిని నియమించడం ద్వారా విద్యా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించగలుగుతుందని అభిప్రాయ పడ్డారు. కావున తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బడ్జెట్లో విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments