Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్యువత మారక ద్రవ్యాలకు బెట్టింగ్లకు దూరంగా ఉండాలిడి.ఎస్.పి చంద్రబాను

యువత మారక ద్రవ్యాలకు బెట్టింగ్లకు దూరంగా ఉండాలిడి.ఎస్.పి చంద్రబాను

Listen to this article

పయనించే మార్చ్ 26 సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు


అసాంఘిక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను. హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గొల్యాతండ పంచాయతీ పరిధిలోని వాగొడ్డుతండా కాలనితండాలలో తెల్లవారుజామున స్నిపర్ డాగ్ తో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలు సేవించడం, గంజాయి విక్రయాలు చేయడం, ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక మాజిక్ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ తాటి పాముల సురేష్, బొడు, ఆళ్లపల్లి ఎస్ఐలు పోగుల సురేష్, పొడి శెట్టి శ్రీకాంత్, ఈ. రతీష్ తో పాటు సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments