Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి.

Listen to this article

డాక్టర్, బి.ఆర్. అంబేద్కర్ ఘనంగా 134వ జయంతి వేడుకలు.

పలువురు ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు.

పయనించే సూర్యుడు:ఏప్రిల్ 14: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.

నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీం కాలని గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ, అంటరానితనాన్ని, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గానికి సమాన వాటా కోసం,సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు అని కొనియాడారు.భారతదేశ స్వపరిపాలన అందించాలనే ఉద్దేశంతో నిరంతరం శ్రమించిన యోధుడని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.ఆయన రాజ్యాంగ రూపకల్పన చేసినందుకే ఈనాడు ప్రతి యెక్క ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో తన హక్కుల కోసం ప్రశ్నించే దైర్యం వచ్చిందని గుర్తుచేశారు.యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఎస్.పి ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్,కొమరం భీం కాలని ఆదివాసులు పాల్గొన్నారు. దళిత సంఘాల,గిరిజన సంఘాల ఆధ్వర్యంలో , ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలతో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు . అనంతరం దళిత నాయకులు యాసం రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటమని, భారత రాజ్యాంగ రూపకర్త 1891 ఏప్రిల్ 14న జన్మించారని వారి జన్మదిన దినాన్ని భారతదేశంలో సమానత్వ దినోత్సవంగా కూడా జరుపుకుంటారని తెలియజేశారు. భారత రాజ్యాంగం నవనిర్మాత, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అలుపెరగని పోరాట ధుడని,సంఘసంస్కర్త అని, రాజకీయవేత్త న్యాయకొవిదుడని ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యత అంటరానితనం గురించి పోరాడుతూనే భారత దేశంలో సబ్బండ వర్గాలకు సమన్వయ న్యాయం భారత రాజ్యాంగ ద్వారా చేసి భారతదేశం నుదుటి రాతను మార్చిన గొప్ప మహనీయుడని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరముల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. రాజ్యాంగం వల్లనే మానవ హక్కులు, రిజర్వేషన్లు పొందుతున్నామని, తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తిప్పనపల్లి రాంబాబు, వంకాయల వెంకటేశ్వర్లు, పూనెంరామచందర్, తెలంగాణ భూమిపుత్ర రాష్ట్ర అధ్యక్షులు జాడీ ఈశ్వర్, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాసం మహేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కోకిల మల్లికార్జున్ మాదిగ, వావిలాల మోహన్ మాదిగ, కోకిల లక్ష్మీనారాయణ, చిన్న నరేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జంపన్న, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments