Saturday, May 3, 2025
Homeఆంధ్రప్రదేశ్జీవనో పాది కోసం మలేషియాకువెళ్లిన పొద్దుటూరు లింగారెడ్డి

జీవనో పాది కోసం మలేషియాకువెళ్లిన పొద్దుటూరు లింగారెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు మే 2 న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన పాట్కూరి లింగారెడ్డి గత ఏడాది కాలంగా మలేషియా అదే లో చిక్కుకుపోయాడు. జీవనోపాధి కోసం అతను మలేషియాకు వెళ్లాడు, కానీ గల్ఫ్ ఏజెంట్లు మరియు మధ్యవర్తులచే మోసపోయాడు.చట్టవిరుద్ధమైన ఇమిగ్రాంట్ కావడంతో అతను మలేషియాలో చాలా బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఇంతలో దురదృష్టవశాత్తు మలేషియాలో బస్సు ప్రమాదంలో గాయపడి మంచం పట్టాడు. ఆనారోగ్యం మరియు ఆర్థిక సమస్యల కారణంగా అతను మలేషియా నుండి ఇంటికి చేరుకోలేకపోయాడు.లింగారెడ్డి క్షేమంగా తిరిగిరావాలని వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్తించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మలేషియాలోని ఐ ఐ హెచ్ సి కి పంపారు. దీనితో అతను ఇండియా తిరిగిరావడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లింగారెడ్డి ఇంటికి తిరిగిరావడానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విమాన టిక్కెట్ అందించారు.ప్రస్తుతం ఆయన స్వగ్రామం చేరుకున్నారు. లింగారెడ్డి కుటుంబ సభ్యులు తమకు అన్ని విధాలుగా సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments