Monday, July 28, 2025
Homeఆంధ్రప్రదేశ్3 జి ఒ పునరుద్దరణ చర్యలను స్వాగతిస్తున్నాం

3 జి ఒ పునరుద్దరణ చర్యలను స్వాగతిస్తున్నాం

Listen to this article

ఏ పి సి ఎం – చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి ధన్యవాదాలు


వెంటనే టి ఏ సి ఏర్పాటు చేయాలి


పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 13

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లో నిన్న జరిగిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో ఏ పి సి ఎం – చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజనులకే కేటాయించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, 2000 ల సంవత్సరంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం గిరిజన ప్రయోజనాల కోసం 3జీఒ ని రూపొందించి, ఏజెన్సీ ఉద్యోగాలు స్థానిక ఆదివాసీల కేటాయించామని, న్యాయ సమీక్షలు 3 జీవో రద్దయిందని, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, 3 జి ఒ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి స్వాగతిస్తున్నామని, అలానే ఏపీ సీఎం నార చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపిఏజెఏసి కేంద్ర కమిటీ సభ్యులు మడివి నెహ్రూ తెలియజేశారు.ఈ సందర్భంగా మడివి నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని (టి ఏ సి) ఏర్పాటు చేయాలని అనంతరం 3జీవో పునరుద్ధరణ లో భాగంగా వెంటనే ఏజెన్సీ నియామకాల చట్టాన్ని రూపొందించాలని, ప్రస్తుత మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి, ఏజెన్సీ నియామకాల చట్టం రూపొందించిన, ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని రూపొందించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టే అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఉద్యమ కార్యాచరణని కొనసాగిస్తుందని తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఐటిడిఏ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపాలు కొనసాగుతాయని కష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments