Sunday, May 18, 2025
Homeఆంధ్రప్రదేశ్కొత్తగూడెంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్స్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి...

కొత్తగూడెంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్స్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Listen to this article

రాష్ట్ర అభివృద్ధిని అందుకునే శక్తి దేశంలో ఏ రాష్ట్రానికి లేదు

పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని, ప్రజల సొమ్ము దుబారా చేసి ప్రస్తుతం రాష్ట్ర


ఎదుగుదల చూడలేక అడ్డగోలుగా మాట్లాడే వారికి అభివృద్ధి తోనే సమాధానం చెబుతాం

గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా, అడవి నష్టపోకుండా ఉండేలా ఇందిరా సౌర జలవికాసాన్ని ప్రారంభిస్తున్నాం

గిరిజనులపై ఒక్క రూపాయి భారం లేకుండా ఈ పథకం కోసం 12,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం

పయనించే సూర్యుడు మే 17 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేనంత విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ చిన్న అంతరాయం లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేశాము.. ఈ రాష్ట్రంలో కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ కెసిఆర్ తెచ్చింది లేదు ..ఇచ్చింది లేదు ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువలకు భూ సేకరణ చేస్తాం.. కాలువలు లేకుండా ప్రాజెక్టులు కట్టిన వృధా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది గోదావరి నదిపై నావిగేషన్ కు అధ్యయనం చేయిస్తాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అందుకునే శక్తి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెం జిల్లాలో పలు విద్యుత్ సబ్స్టేషన్లకు, పాల్వంచలో హై లెవెల్ బ్రిడ్జి పండ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్లో ప్రసంగించారు. రాష్ట్రంలో సాఫ్ట్వేర్, ఫార్మా, విద్యుత్తు, హెల్త్, హౌసింగ్ వంటి పరిశ్రమలతో పాటు సంక్షేమ పథకాలతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. పదేళ్లు ప్రజల సొమ్ము దుబారా చేసి ఇంట్లో పడుకున్న వారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారందరికీ అభివృద్ధి తోనే సమాధానం చెబుతామని డిప్యూటీ సీఎం అన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా, అడవి నీ కాపాడుకునేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అలాగే కృష్ణ పరివాహక ప్రాంతంలోని గిరిజనులకు ప్రతి మూడు నెలలు, ఆరు నెలలకు ఆదాయం వచ్చేలా ఇందిరా గిరి జిల్లా వికాసం పథకాన్ని రూపొందించాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బోర్లు వేయించి సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించి, డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటుచేసి ఉద్యాన శాఖ ద్వారా అవకాడో, వెదురువంటి పంటలు సాగు చేయిస్తాం అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం గిరిజనులపై ఒక్క రూపాయి భారం పడకుండా 12,500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 2023 -24లో రాష్ట్రంలో 15వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉండగా గత పాలకులు అది కూడా సక్రమంగా చేయలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఈ మార్చిలో 17,162 మెగావాట్ల పిక్ డిమాండ్ వచ్చినప్పటికీ చిన్న అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఈ విద్యుత్ డిమాండ్ ఏర్పడలేదు అన్నారు. థర్మల్ పవర్ తో పాటు హాస్టల్లో అందుబాటులో ఉన్న సోలార్, హైడల్, విండ్ పవర్ను వినియోగంలోకి తీసుకురానున్నట్టు అన్నట్టు తెలిపారు. 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల రూపొందించుకొని ముందుకు పోతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో కరెంటు తెచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే.. కెసిఆర్ పరిపాలనలో ఆయన తెచ్చింది లేదు ఇచ్చింది లేదు అన్నారు. సీతారామ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టుగా ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. ప్రాజెక్టు కాలువలకు కావలసిన భూసేకరణ చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి కాలువలు నిర్మించకపోవడంతో ఉపయోగ ఉండదని, బ్యారేజీలు, రిజర్వాయర్లు కట్టి వదిలేస్తే సముద్రం లో నీళ్లు ఉన్నట్టే కానీ ఉపయోగం ఉండదు అన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని, లక్ష కోట్లు ఖర్చు చేసిన కాలేశ్వరం నుంచి కూడా ఒక ఎకరం సాగునీరు అందలేదు అన్నారు. డిండి, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత అక్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఢిల్లీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా కలిసి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అధికారులను కలుస్తారని వివరించారు. మన రాష్ట్ర ఎంపీలకు కావలసిన పూర్తి సమాచారం అందించాం, వారు చక్కగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ సమగ్ర ప్రణాళికలతో ముందుకు పోతుంది అన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రీజినల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య ఫార్మా, అగ్రికల్చర్, హౌసింగ్ వంటి పలు రకాల క్లస్టర్లను నిర్మించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి సి పోర్టు లేదు రోడ్డు మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. రాష్ట్రంలో గోదావరి నదిపై రవాణాకు ఉన్న అవకాశాలనుపై అధ్యయనం చేయిస్తామని, అవకాశం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ సృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం తెలిపారు. ముందుగా నావిగేషన్ పై సమగ్ర అధ్యయనం జరిగేలా చూస్తానని తెలిపారు.

అన్ని వర్గాల పిల్లలకు ఉచితంగా ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, మొదటి దశలోనే 104 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం అన్నారు. ఒక్కో పాఠశాలకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక పద్ధతుల్లో ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుంది అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments