
పయనించే సూర్యుడు// న్యూస్ మే 26// నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలోని గల ZPHS స్కూల్లో చదివిన 1999_2000 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థి విద్యార్థులు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు కష్టాసుఖాలు బాధలు ఒకరికొకరు పంచుకున్నారు. అలాగే వారికి విద్యనేర్పిన గురువులను కూడా పిలిపించుకొని సన్మానం చేశారు వారిలో కొందరు మిత్రులు అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. C నారాయణ అనే స్నేహితుడు కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇకమీదట కూడా మా స్నేహం ఇలాగే కొనసాగుతూ ఉంటుందని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా అందరం తోడుగా ఉంటామని కష్టసుఖాలను పంచుకుంటామని అన్నారు దాదాపుగా 40 మంది స్నేహితులు పాల్గొన్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించిన జగదీష్ ఆంజనేయులుకు స్నేహితులందరూ అభినందనలు తెలియజేశారు.