
జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ తదితరులు
( పయనించే సూర్యుడు మే 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
భారత స్వాతంత్ర్య సమరయోధులు,భారత తొలి ప్రధాని,భారతరత్న జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వం, సర్వర్ పాషా, అన్వర్,దేవేందర్,రాయికల్ శ్రీనివాస్,శ్రీను నాయక్,తుపాకుల శేఖర్,మంకల శ్రీశైలం, వాసు,గంగమోని సత్తయ్య,రవితేజ,తదితరులు పాల్గొన్నారు.
