
పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం పేరమల్లపాడు గ్రామంలోని పెన్న ఏటి గట్టున వ్యవసాయ రైతులు తలపనేని .జయంతి నాయుడు. షేక్ ఖాజావలి అనే రైతులు ఇద్దరివి కలిసి ఆరు ఎకరాలు సవక తోట ను ఐదవ తేదీ గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయములో పక్క పొలం రైతు గట్టుపల్లి. జయరామయ్య అనే వ్యక్తి పక్క న పొలం రైతు కు చెందిన ఖాజావలి గట్టుమీద పెద్ద మంట వేసి న జయ రామయ్య ఆ మంటలను గాలికి ఆపలేక పోవడంతో 12 ఎకరాలు సవక తోట మంటలు ఎగిసిపడుతున్న సమయంలో సంబంధిత రైతులు సమాచారం అందిన వెంటనే ఆత్మకూరు ఫైర్ శాఖ సిబ్బంది సమాచారం తెలిపిన వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడం జరిగింది ఒక ఎకరాకు రెండు లక్షలు చొప్పున 12 ఎకరాలకు 12 లక్షలు రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టము జరిగిందని బాధితులు శుక్రవారం చేజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు మేరకు స్పందించిన చేజర్ల ఎస్సై తిరుమల రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శుక్రవారం తెలిపారు
