
ఏ.డి.ఏ శోభన్ బాబు ఎం. ఏ. ఓ. ఎన్ అన్నపూర్ణ
పయనించే సూర్యుడు జూన్ 6 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండల పరిధిలో ఉన్న తొమ్మిదో మైల్ తండా లో శుక్రవారం జిల్లా వ్యవసాయ లోకార్యాలయం టెక్నికల్ ఏడిఏ శోభన్ బాబు తొమ్మిదో మైలు తండా లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, రైతులలో మాట్లాడారు.పొడి దుక్కులలో పత్తి విత్తనాలు వితకూడదని కనీసం 2-10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినప్పుడే మాత్రమే రైతులు విత్తనాలు విత్తుకోవాలని తెలియజేశారు. 9వ మైలు తండాలో ఉన్న పురుగు మందుల షాప్ లో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్, పెర్మిషన్ కాపీ లను వారు తనిఖీ చేశారు.అనంతరం వారు పిఎసిఎస్ సొసైటీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ విధానాన్ని పర్యవేక్షణ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఏఎంఓ ఎన్.అన్నపూర్ణ, రైతులు పాల్గొన్నారు.