Sunday, June 8, 2025
Homeతెలంగాణకాలుష్యాన్ని వెదజల్లే ఇత్తనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.

కాలుష్యాన్ని వెదజల్లే ఇత్తనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.

Listen to this article

జర్నలిస్టులపై కేసులు సరైనది కాదు

ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్న మయింది.

జర్నలిస్టులపై మరియు రైతులపై కేసులు ఎత్తివేయాలి. పుడమి ఫౌండేషన్

//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 9//మక్తల్ :జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద దాన్వాడ గ్రామంలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాడుతున్నారు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే రసాయనాలు చెరువులో కుంటలో నదిలో వదిలేస్తున్నారు ఆ రసాయన నీళ్లు తాగి జీవరాశులు మనుషులు అనారోగ్యా బారినపడి చనిపోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఇలాంటి ఫార్మ కంపెనీలు ఇథనాల్ కంపెనీలను ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఇప్పటికైనా ఇలాంటి కంపెనీలను పర్మినెంట్గా మూసివేయాలి ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఇలాంటి కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రజలు చెప్పినట్టు వినాలి లేకపోతే ప్రభుత్వాలు *నీలమట్టం అయ్యే అవకాశాలు ఉంటాయి.ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతు తెలపడం సిగ్గుచేటు దేశవ్యాప్తంగా ప్రకృతి విలయ తాండవం చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలతో మమేకమై ప్రభుత్వాలు ముందుకు కొనసాగాలి..జనం సాక్షి రిపోర్టర్ రెహమాను పై పెట్టినా అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు రైతులపై పెట్టిన అక్రమ కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను.పుడమి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జే వెంకటపతి రాజు ఉపాధ్యక్షులు.రవికుమార్. ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్యాట పవన్ కళ్యాణ్. గుడిసె రాజేష్. ప్రకటనలో ఖండించడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments