
పయనించే సూర్యుడు జూన్ 07 (పొనకంటి ఉపేందర్ రావు )ఇల్లందు అప్పుల బాధతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు మనో ధైర్యంతో ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధించాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ తెలియజేశారు. ఇల్లందు పట్టణం లోని మహిళలకు ఆర్టీసీ ఫ్రీ పథకంతో ఆటోలకు గిరాకీలు పడిపోయి ఆత్మహత్య చేసుకున్న 5 కుటుంబాలను అరికెల కృష్ణ, బి శ్రీకాంత్, ఉప్పాల సూరత్, ఎండి జానీ, ఎండి అప్టల్ పరామర్శించిన ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కొక్క ఆటో కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తిరుమలరావు, ఇల్లందు పట్టణ అధ్యక్షులు ఎస్కే సలీం, మోష తదితరులు.