Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా భగవాన్ బీర్ష ముండా వర్ధంతి..

ఘనంగా భగవాన్ బీర్ష ముండా వర్ధంతి..

Listen to this article

పయనించే సూర్యుడు;జూన్09: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.

నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా నూగూరువెంకటాపురం మండలకేంద్రంలోని కొమరంభీమ్ కాలనీలో సోమవారం గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘం ఆధ్వర్యంలో బీర్ష ముండా 125 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ.19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారనీ తెలిపారు.ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారని గుర్తుచేశారు.
సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 18వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారనీ. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారనీ అన్నారు.ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ ప్రసంగిస్తూ,ముండా జనజాతివారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఒక ఉద్యమానికి నేతృత్వం వహించారని. కాలేజీలో, స్కూల్ లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారని తెలిపారు. ఆయన నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేస్తూ 1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచారని అన్నారు. ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన స్ఫూర్తితో ఈనాడు ఆదివాసి సమాజ ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని చట్టాలు జీవోల అమలుకై పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జీఎస్పి కార్యకర్తలు పర్శిక బాబూరావు పూనెం కృష్ణ కొమరం భీం కాలని ఆదివాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments