
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పిట్ల మీనా దురదృష్టవశాత్తు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం రోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవా రెడ్డి పాలెం నరసయ్య బద్దం లింగారెడ్డి శీను తాళ్ల రాంపూర్ భాను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
