Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్రుద్రూర్ లో జర్నలిస్టుల నిరసన…

రుద్రూర్ లో జర్నలిస్టుల నిరసన…

Listen to this article

బస్టాండ్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తున్న జర్ననిస్టులు..

రుద్రూర్, జూన్ 10 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రుద్రూర్, వర్ని, కోటగిరి మండలాల పత్రికా, మీడియా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సాక్షి మీడియా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. సాక్షి మీడియా జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావును బేషరత్తుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి సీపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు నూత్ పల్లి గణేష్, రమేష్, నాగేష్, సాయిలు, ఉమాకాంత్, నర్సింలు, పెంటయ్య, హరీష్, సీపిఎం పార్టీ నాయకులు లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments