Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలుతీసుకుంటాం

అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలుతీసుకుంటాం

Listen to this article

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. కాకర్లపూడి విక్రాంత్.

పయనించే సూర్యుడు; జూన్ 10: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని నాగారం,చింతూరు,ఎడ్జర్లపల్లి, మురుమూరు,చంద్రుపట్ల పంచాయతీలోని ఆరుగురు అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో గతంలో ఇల్లు పొందినట్లు చూపించడంతో మంజూరైన ఇళ్లను క్యాన్సల్ చేశారనీ, దీనితో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. నిరుపేదలుగా ఉంటూ పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న మాకు ఇందిరమ్మ ఇల్లు క్యాన్సల్ చేయడం సరైనది కాదని మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ బాధితులతో మాట్లాడి ఇట్టి విషయాన్ని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ద్వారా తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.ఇల్లు మంజూరై క్యాన్సిల్ అయిన బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. 1,గణపురపు నర్సు 2,బోదెబోయిన మల్లమ్మ 3, గుండెబోయిన లక్ష్మి, 4దళాయి శ్రీదేవి,5అట్టం చిన్న సమ్మక్క, 6 ఇర్ప లావణ్యకాగా వీరికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments