
రుద్రూర్ బస్టాండ్ లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం..
రుద్రూర్, జూన్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజలకు మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ… యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లుకు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.