
ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు మంత్రి వాకిటి…..
పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 15//మక్తల్
నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మాత్యులు ” శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి …..
అనంతరం మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా పెద్దలు మల్లికార్జున ఖర్గే ,తెలంగాణ ఇచ్చిన ప్రదాత తల్లి సోనియమ్మ ఇస్ దేశ్ మే జితిని ఉనికి ఆవాజి ఉనికి ఉత్ని ఇస్తే దారి అని చెప్పి భారతదేశంలోని వెనుకబడ్డ జాతులను లేపి సంఖ్యాపరంగా మీ వెనకాల మేమున్నామంటూ దారి చూపినటువంటి రాహుల్ గాంధీ ,కేసి వేణుగోపాల్ ,ప్రియాంక గాంధీ మన రాష్ట్రంలో కూడా కుల గణన చేసిన ,బీసీ బిడ్డ కాకున్నాగా మీ సంఖ్య ఇది అని చూపించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకొని బీద బడుగు బలహీన వర్గాలకు దారి చూపిన మహేష్ అన్న , మిగతా మంత్రిమండలి అంతా, అదే విధంగా మన ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అందరూ కూడా ఏ బాధ్యతతో మంత్రిమండలిలో నన్ను తీసుకున్నారో ఆ బాధ్యతను మనసా, వాచ, కర్మేనా, పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ ఈ బాధ్యతను నాకు ఇచ్చినటువంటి పార్టీకి ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీల ఆలోచన విధానాన్ని బీసీల వెనుకబాటుతనాన్ని కచ్చితంగా సాధ్యమైనంతవరకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటానని అన్నారు పార్టీ అప్పజెప్పిన ఈ పెద్ద అవకాశాన్ని పూర్తిస్థాయిలో జీవితమంతా ప్రజలతోనే నా చావు కూడా ప్రజల దగ్గర ఉండే విధంగా దారి ఇచ్చారు కాబట్టి అదేవిధంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేల కు మరియు నన్ను ఈ స్థానంలో కూర్చున్న కూర్చోబెట్టినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మంత్రివర్యులతోపాటు కాంగ్రెస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ నాయకులు బికేఆర్ ఫౌండర్ బాలకృష్ణారెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌడ సంఘం అధ్యక్షులు కేశం నాగరాజు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి కుమార్ యాదవ్, నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు
