
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం
అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏఐయు కె ఎస్ కమ్మర్ పల్లి మండల కేంద్రం లో ర్యాలీ ధర్నా…కమ్మర్పల్లి మండల పరిధిలో ఆస కొత్తూరు. బషీరాబాద్. చౌట్ పల్లి. కమ్మర్పల్లి. అమీర్ నగర్. నర్సాపూర్ తదితర గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, వెనుకబడిన, ప్రజలు సుమారుగా 60 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలిస్తానని చెప్పి మోసం చేసినందుకు సరైన గుణపాఠం చెపారని ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వి ప్రభాకర్. సారా సురేష్. దేవారంలు అన్నారు. అంతేకాక పట్టాలిచ్చి రైతుబంధును కూడా ఇస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశాడని స్వయంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పి తాను అధికారాంలోకి రాగానే అందరికీ పట్టాలి ఇస్తానని రైతు భరోసా కల్పిస్తానని 6 గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చి కెసిఆర్ వివరించిన తీరులోనే వ్యా వహరిస్తున్నాడని ఎద్దేవ చేశారు. ఇప్పటికన్నా అనేక సార్లు ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అతి లేదు గతి లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారెస్ట్ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆర్థికంగా బలంగా ఉన్నవారికి అండగా నిలబడడమే కాకుండా పేద వర్గాలపై కేసులు పెడతామని సతాయిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల తీరు మార్చుకోకపోతే అవినీతి అధికారులు రంగంలో ప్రవేశించాల్సి వస్తుందని కూడా గుర్తు చేశారు..
ఈ గ్రామల ప్రజలకు ఇప్పటికైనా సర్వేలు జరిపి వీరంతా అర్హులని గుర్తించి అమలు చేయడం మర్చిపోతున్న అధికారుల్లారా అధికార పార్టీ నాయకుల్లారా మీరు వచ్చే ఎన్నికల్లోతిరిగి మా గ్రామాలకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు..జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజుల్లోనే కలెక్టర్ ని కలిసి వీరికి పట్టాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు సిరికొండలాంటి గ్రామాల్లో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భూముల్లోకియకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారుల వైనాన్ని దుయ్యబట్టారు.. పట్టాలు ఉన్న వారిని సైతం హక్కు పత్రాలు ఇచ్చిన వారిని సైతం సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరు అనుకోవడం ఫారెస్ట్ అధికారులారా ఇప్పటికైనా మేలుకోండి మీ తప్పుడు పద్ధతుల్ని మానుకోండి అంటూ హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శి. బి అశోక్. అఖిలభారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షులు వి బాలయ్య. నాయకులు అశోక్. టీ బాలకిషన్. ఢిల్లీ గంగాధర్. శంకర్ . ముత్తన్న. కె . రాజేశ్వర్. రవితేజ. తదితరులు పాల్గొన్నారు….