Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్బస్సు పాస్ పెంపు పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే

బస్సు పాస్ పెంపు పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే

Listen to this article

బస్సు పాస్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్

జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గ బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్ కి వినతి

( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )

రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ విద్యార్థుల బస్ పాస్ చార్జీలపై 20 శాతం పెంపు వలన పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని వెంటనే పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చవాన్, సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ప్రభుత్వంని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్, ఆకాష్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువు నిమిత్తం ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్లి చదువుని కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, ఇప్పటికే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోడానికి సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వ కళాశాలలు చదువుతూ తమ చదువును కొనసాగిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బస్ చార్జీలు పెంపుతో పేద విద్యార్థుల పై మరింత భారం పడుతుందన్నారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల బస్ పాస్ చార్జీలు 20 శాతానికి పైగా పెంచుతున్నామని ఆర్టీసీ సంస్థ ప్రకటించినదని విద్యార్థులు బస్సు పాస్ ధర 20% పెంపును అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తుందన్నారు ప్రస్తుతం పెరిగిన ఖర్చులు కారణంగా విద్యార్థులు బస్సు పాసు ధరలు పెంచినట్లు అధికారులు వెల్లడించడం తగదన్నారు. పెంచిన ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ,బస్ పాస్ ధరలు పెంచడం ఎంతవరకు సబబు అని అన్నారు. విద్యార్థుల పెంచిన బస్సు పాస్ ధరలను తగ్గించి విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రంగారెడ్డి జిల్లా జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నామన్నారు.బస్ పాస్ పెంపు తో విద్యార్థులు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కానున్నదని రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 11 లక్షల వరకు బస్సు పాసులు ఉన్నాయని విద్యార్థుల పైన అధిక భారం మోపకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల పెంచిన బస్ పాసులు ధరలు తగ్గించాలని లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ నాయకులు ఆకాష్,రాహుల్, శ్రీను, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments