
పయనించే సూర్యుడు జూన్ 19 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా ముత్యాలపాడు క్రాస్ రోడ్డు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కందుల దినేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 2047 సంవత్సరానికల్లా సికిల్ సెల్ రక్తహీనతను తొలగించడానికి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్యంగా జన్యుపరంగా సంక్రమించే ఈ వ్యాధి రక్త కణాలు అర్థ చంద్రాకారంలో ఉండి రక్త ప్రవాహానికి అడ్డు పడడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన కిడ్నీ లివరు స్ప్లీన్ ఎముకలు మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయి ఇన్ఫెక్షన్లు రావడానికి ఎముకలు మరియు జాయింట్ పెయిన్స్ ఛాతిలో కడుపులో నొప్పి రావడం అరచేతులు పాదాలు వాపు రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం నీరసం పాలిపోయిన చర్మం చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం ఎన్నో సమస్యలు ఉంటాయని కాబట్టి 2047 సంవత్సరం కల్లా ఈ వ్యాధి లేని సమాజాన్ని కొరకు వివాహానికి ముందే సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్షలు విధిగా చేయించుకోవాలని వైద్యాధికారి కోరారు ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ఆరోగ్య ఉప కేంద్రాలలో ఉచితంగా సికెల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని 40 సంవత్సరాల లోపు వయస్సు వారందరూ కూడా విధిగా ఆ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఈ వ్యాధి లేని భారత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల వెంకటేష్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ పబ్లిక్ హెల్త్ నర్సాఫీసర్ చంద్రకళ సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్ నాగుబండి వెంకటేశ్వర్లు గుజ్జా విజయ కౌసల్య సింగ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధరణి హారిక అమూల్య ఇంద్రజ రుక్సానా శైలజ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు