
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
దీపికా మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ నూతన భవన ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు
విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే పాఠశాలల యొక్క మొదటి ప్రాధాన్యతై ఉండాలని నాణ్యమైన విద్యా బోధన విధానము ద్వారానే విద్యార్థులు వారు నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరువైతారని ఎమ్మెల్సి నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో దీపిక మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యాజమాన్యం ఇందిరా డానియల్, జిమ్మి,మాజీ కౌన్సిలర్ బీఎస్ సుధీర్, తుప్పుడు నరసింహ,నరేందర్,దినేష్ సాగర్, శ్రీకాంత్ గౌడ్,సుధీర్, మధు,జిజో జాన్సన్, అజయ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
