
పయనించే సూర్యుడు జూన్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు హైదరాబాద్ లో రామన్నగూడెం గ్రామపంచాయతీ లో ఉన్న సమస్య లు పైన జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ గారిని కలిసి వివరించటం జరిగింది.రామన్న గూడెం గ్రామ సర్వే నెంబర్:30,36,39 లలో ఉన్న జిల్లా కలేక్టర్ గారి ఆర్డర్స్ మరియు గౌరవనీయులైన హై కోర్టు ఆర్డర్స్ ప్రకారం వెంటనే జాయింట్ సర్వే నిర్వహించి భూములను అప్పగించాలని కోరుతూ.ఇందిరమ్మ ఇల్లు కూడా గిరిజనులకు మంజూరు చేయకుండా గిరిజనేతరులకు మాత్రమే మంజూరు చేయటం జరిగింది.సానుకూలంగా స్పందించిన జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు మీ సమస్య నా దుష్టికి రావటం జరిగింది. మీ సమస్య ను పరిష్కారం చేసి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చేస్తాను అని తెలియజేయటం జరిగింది.జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుల ను కలిసిన వారి లో దిశా ఫౌండేషన్ సేవ సొసైటీ అధ్యక్షులు సాగర్,వైస్ చెర్మన్ సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతూ నందు నాయక్, రామన్న గూడెం గ్రామస్తులు మడకం నాగేశ్వరరావు,మడకం కన్నారావు, కోర్స శ్రీను, కోర్స నాగరాజు ఈరోజు హైదరాబాద్ లో కలవటం జరిగింది.