Monday, June 23, 2025
Homeఆంధ్రప్రదేశ్పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా..

పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా..

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నిజామాబాద్, నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో గల బీఎల్‌ఎన్ గార్డెన్‌లో నిర్వహించిన పట్టణ పద్మశాలి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా. రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ, పద్మశాలిల పట్ల తనకు ప్రత్యేక గౌరవం, అభిమానం ఉందని, పద్మశాలీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.రూరల్ నియోజకవర్గంలోని బోర్గంలో పద్మశాలి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.10 లక్షలు తన ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు.జిల్లా పద్మశాలి సంఘం కోసం గంగస్థాన్ ఫేజ్-2, ఉత్తర తిరుమల దేవస్థానం సమీపంలో అర ఎకరం స్థలాన్ని కేటాయించి, కలెక్టర్‌ ద్వారా సీసీల్ ‌కు పంపించి పత్రాల ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ స్థలాన్ని సంఘానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, ఇతర కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘం తరఫున ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ఉప్పు గంగారెడ్డి,పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, 26 తర్పాల పద్మశాలి కార్యవర్గ సభ్యులు, భారీ సంఖ్యలో పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments