
:పయనించే సూర్యుడు:జూన్: 24: మక్తల్
మక్తల్ : భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మక్తల్ మండలంలోని గొల్లపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. నేటితరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్దన్, నాయకులు అశోక్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు
