Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్విద్యాపరిరక్షణ కమిటీ ధర్నాను విజయవంతం చేయండి.

విద్యాపరిరక్షణ కమిటీ ధర్నాను విజయవంతం చేయండి.

Listen to this article

విద్యా పరిరక్షణ కమిటీ

:పయనించే సూర్యుడు :జూన్ 26: మక్తల్

ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ, ఈనెల 27వ తేదీన, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

ప్రతి వ్యక్తికి సమానమైన, నాణ్యమైన, ఉచిత నిర్బంధ విద్య అందితేనే సమాజం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి చెందుతుంది.కానీ పాలకులు విద్యారంగాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే విస్మరిస్తూ, ప్రైవేటు విద్యను, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యలో మత భావాలను చొప్పిస్తూ, అశాస్త్రీయతను పెంచి పోషిస్తున్నారు, వారి భావాలకు ప్రతికూలంగా ఉండే పాఠ్యాంశాలను తొలగిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యలో అనేక దొంతరలను ప్రవేశ పెడుతూ, చీలికను తీసుకువస్తున్నారు. అసమానతల విద్యను పెంచి పోషిస్తున్నారు. అంతేకాకుండా భోధన,బోధనేతర పోస్టులను ఖాళీగా ఉంచుతూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు, కార్పోరేట్ విధ్యనే నాణ్యమైనది, అనే దృష్టి కోణాన్ని ప్రజల్లో పెంచుతున్నారు. ఈ ధోరణి సమాజానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.కనుకనే ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. కచ్చితంగా ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రభుత్వ విద్యలో కూడా పూర్వ ప్రాథమిక పాఠశాలను నిర్వహించాలి. ఈ విషయంపై పాలకులు దృష్టి సారించడం అత్యవసరం.ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయడంలో బాగంగానే కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులను తగ్గిస్తూ వస్తున్నది. రాష్ట్రంలో గత BRS ప్రభుత్వమయితే విద్యను పూర్తిగా అధమ స్థితిలోకి నెట్టింది.దాని మూలంగా ప్రజల్లో రేకెత్తిన అసహనాన్ని ఉపయోగించుకుని అధికారoలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం,విద్య పట్ల అదే ధోరణిని కొనసాగిస్తున్నది. ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన, 15% నిధులు విద్యారంగానికి ఇవ్వకుండా, వరుసగా 2 బడ్జెట్లలోనూ 7.5% మాత్రమే నిధులను కేటాయించింది.అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ,DEO పోస్టులను భర్తీ చేసి,పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను వారికి ఇవ్వకుండా, ఉపాధ్యాయులకు ఇవ్వ చూడటం అనేది మరో రకమైన తిరోగమన చర్య. వీటిని వ్యతిరేకిస్తూ, ప్రధానంగా అందరికీ ఉచిత నిర్బంధ నాణ్యమైన విద్యా సమానంగా అందాలనే లక్ష్యం తోటి కార్పొరేట్ విద్యను నిషేధించాలనీ, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,ఈనెల 27న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే విద్యాపరిరక్షణ కమిటీ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయండి.అందుకు సన్నాకంగా ఇవాళ మక్తల్ MRC వద్ద జరిగిన కరపత్రం విడుదల కార్యక్రమంలో, విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు సూర్యచంద్ర,హైమావతి, భాస్కర్, కిరణ్,భుట్టో,రాజు, శ్రీవిద్య,అనిత, అశోక్, సంధ్య, పరంధాములు,
వై చంద్రశేఖర్,దశరథ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments