
విద్యార్థులకు తాగడానికి కూడా మంచి నీరు లేని పరిస్థితి
విద్యార్థులకు నాణ్యమైన భోజన కొరత.
( పయనించే సూర్యుడు జూన్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో షాద్ నగర్ లోని ఉర్దూ మీడియం స్కూల్ లో భోజన తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ అధ్క్షాకార్యదర్శులు సుమయిర్ మరియు శివ శంకర్ మాట్లాడుతూ… విద్యార్థులకు ఎటువంటి మెనూ పాటించుకోకుండా వారికీ నచ్చిన వంటలు చేస్తున్నారు… ప్రభుత్వాలు ఏమో మేము పేద విద్యార్థుల కోసం ఎటువంటి GO అయినా తీసుకువస్తాం అందరూ బాగా చదువుకోవాలి వారికీ ఎటువంటి భోజనాన్ని అయినా అందిచడానికి సిద్ధంగా ఉన్నాం అని మాటలు చెప్తా ఉంటే దానికి పూర్తి విరుదంగా ప్రభుత్వా ఉర్దూ మీడియం స్కూల్ నడిపిస్తున్న పరిస్థితి కాబట్టి అధికారులు స్పందించి ఉర్దూ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకోవాలి అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అదిల్, ముస్తఫా, రెహమాన్, హర్ష, శివ, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.