
అవగాహన కల్పిస్తున్న దృశ్యం..
రుద్రూర్, జూన్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు నాశనం అవుతాయాన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, ఎంఈఓ కట్ట శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.