
:పయనించే సూర్యుడు: జూన్: 29: మక్తల్
మక్తల్ పట్టణంలో నారాయణపేట్ జిల్లా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ప్రతినిధులు పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్య, క్రీడలు యువజన సర్వీసులు శాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి* వారి నివాసంలో కలిసి నారాయణపేట్ జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కన్నా శివకుమార్, మరియు భజరంగ దళ్ జిల్లా ప్రముఖ్ శ్రవణ్ కుమార్,గోరక్ష ప్రముఖ్ సందీప్, ఆధ్వర్యంలో మంత్రివర్యులను కాషాయ కండువాతో ఘనంగా సన్మానించి తెలంగాణ రాష్ట్రంలో గో సంరక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా నడుస్తున్న గోవదశాలలను తక్షణ మూసివేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో, జిల్లాలలో గుర్తింపు పొందిన గోశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గోశాలలను ఏర్పాటు చేయాలని, దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాలలో కూడా గోశాలలు ఏర్పాటు చేయాలని, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు మరియు గోపోషకులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వేద కాలం నుండి ఆరాధ్య దేవతగా, సకల దేవతలకు నిలయంగా, దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో మొదలుకొని పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంతో పాటు సకల మానవాళి ఆరోగ్య రక్షణకు ఆధారమై సకల దేవతలకు నిలయమైన గోమాతలను రక్షించి తెలంగాణ రాష్ట్రంలో గోవధ జరగకుండా గోసంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేసి గోమాతలను కాపాడాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవ సభ్యులు వి. భీమ్ రెడ్డి, జిల్లా సహకార దర్శి డి. భాస్కర్ రెడ్డి, భజరంగ్ దళ్ జిల్లా సహా ప్రముఖ్ పసుపుల భీమేష్, భజరంగ దళ్ ప్రఖండ ప్రముఖ్ రాహుల్,శ్రీనివాసులు,అనిల్,పరశురాం,సురేష్, రాము, తదితరులు పాల్గొన్నారు.
