Sunday, June 29, 2025
Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ శాఖ అభివృద్ధికి వినియోగదారులు సహరించాలి

విద్యుత్ శాఖ అభివృద్ధికి వినియోగదారులు సహరించాలి

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మల్లేపల్లి తిరుపతయ్య)

ఆత్మకూరు డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో జాతీయ విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు డివిజనల్ విద్యుత్ శాఖ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ కు సహకరించాలని కోరిన విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.భాను నాయక్. విద్యుత్ శాఖ ఆత్మకూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఈ ఈ వీరు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ ఆత్మకూరు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో శనివారం జాతీయ విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా భద్రత నియమాలను వివరించే ఫ్లెక్సీ ను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈ ఈ ఎం.భాను నాయక్, ఏ డి ఈ. చిన్నస్వామి నాయక్, సిబ్బంది హాజరయ్యారు..రైతులకు వ్యవసాయ ఉపయోగానికి నిరంతరం తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా అందించాలని అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలని సిబ్బందికి భాను నాయక్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో ఏమైనా అంతరాలు ఉంటే తన దృష్టి తీసుకురావాలని ఈ సందర్భంగా సిబ్బంది సూచించారు. విద్యుత్ ను వినియోగదారులు పొదుపుగా వాడుకోవాలని జాగ్రత్తలు పాటించాలని, అలాగే విద్యుత్ తీగల కింద చెట్లను పెంచకూడదని, పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని, రానున్న వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ తీగలలో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు తమ శాఖ సిబ్బంది పరిశీలిస్తూ పరిష్కరిస్తున్నారని నిరంతరం వారు శ్రమిస్తున్న తీరుకు అభినందిస్తూ వీరికి విద్యుత్ శాఖ అభివృద్ధికి విద్యుత్ పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించాలని విద్యాశాఖ సిబ్బంది తదితరులు కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments