
పయనించే సూర్యుడు జూన్ 29 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లెమండలం ; జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి అప్రజాస్వామికంమంటూ.. మీడియాలో ప్రసారమయ్యే మరియు ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే అబ్సక్షన్ తెలియచేసే విధానంమంటూ ఉంటుందని ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమాచారం అందిస్తుందని ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంది అటువంటి మీడియాపై దుశ్చర్యలకు పాల్పడి గొంతు నొక్కడం సమంజసం కాదంటూ.. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ తప్పనిసరిగా ఖండించాలని ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసు శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపి కారకులైన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన గుణపాఠం చెప్పాలని మీడియా స్వేచ్ఛను హారించడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖుణీ చేసినట్లేనని ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితులు సమాజానికి పెను ప్రమాదం అని ఆయన తెలిపారు.