Tuesday, July 1, 2025
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో బెస్ట్ అవలేబుల్ పథకం 200 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి.

రాష్ట్రంలో బెస్ట్ అవలేబుల్ పథకం 200 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి.

Listen to this article

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ కు డిబిఎఫ్ వినతి అందజేత

మద్దతుగా పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘం మక్తల్.

పయనించి సూర్యుడు//జులై 1//మక్తల్

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ హైదరాబాదు ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం లో చైర్మన్ బక్కి వెంకటయ్య కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని అధ్యక్షులు పృథ్వీ రాజ్ తెలిపారు. ఈ సందర్బంగా డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ .రాష్ట్ర వ్యాప్తంగా 180 ప్రవెట్ పాఠశాలలో బెస్ట్ అవలెబుల్ ఉచిత విద్యా పధకం కింద ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు డే స్కాలర్,రెసిడెన్షియల్ లో 26 వేల కు పైగా విద్యార్ఠులు చదువుకుంటున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటుతున్న నేటికి పిల్లలను చాలా పాఠశాలలో చేర్చుకొకపొవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.నేటికీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో పాఠ్య,నొట్ పుస్తకాలను అందజేయలేదన్నారు. అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ* ప్రభుత్వం వెంటనే స్పందించి గత మూడు సంవత్సరాల 200 కోట్ల పెండింగ్ ఫిజు బకాయిలను చెల్లించి ప్రవెట్ పాఠశాల యాజమానుల వేధింపుల నుండి తల్లిదండ్రులను, పిల్లలను కాపాడాలని ,చదువులు సాఫిగా కొనసాగేలా చూడాలని కోరుతున్నామన్నారు. ఎస్సి,ఎస్టి కమీషన్ స్పందిస్తూ ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తిసుకెల్లి సమస్యను పరిష్కరిస్తనని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి,వివిధ సంఘాల నాయకులు రాజేష్,శ్రీను,సుధాకర్ ,లింగన్న,బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments